ఐపీఎల్ 2024: నేడు సండే డబల్ ధమాకా మ్యాచులు

by Disha Web Desk 12 |
ఐపీఎల్ 2024: నేడు సండే డబల్ ధమాకా మ్యాచులు
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా కీలక మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఆదివారం కావడంతో సండే డబల్ ధమాకా మ్యాచులు జరగనున్నాయి. ఇందులో మొదటి మ్యాచ్‌లో పంజాబ్, చెన్నై జట్లు తలపడనుండగా.. రెండో మ్యాచుల్లో లక్నో, కలకత్తా జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రోజు జరిగే రెండు మ్యాచుల్లో నాలుగు జట్లు ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. కాగా మొదటి మ్యాచులో తలపడుతున్న చెన్నై, పంజాబ్ జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్ కావడం విశేషం.. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ రేసులో పటిష్టం అవుతుంది. అలాగే ఓడిన జట్టు తమ ఆశలను క్లిష్టతరం చేసుకుంటుంది. అలాగే రెండో మ్యాచులో తలపడుతున్న కలకత్తా మొదటి స్థానం చేరుకోవడానికి ఈ విజయం అవసరం ఉండగా.. లక్నో జట్టు ప్లే ఆఫ్ బెర్త్ పటిష్టం చేసుకోవడం కోసం విజయం తప్పని సరిగా మారింది. కాగా ఈ రోజు జరిగే ఈ రెండు మ్యాచుల్లో నాలుగు జట్లుకు విజయం తప్పనిసరి కావడంతో మ్యాచులు తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story

Most Viewed