- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
BREAKING: అమెరికాపై ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్
దిశ, వెబ్డెస్క్: టీ-20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. సూపర్-8లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్, అమెరికా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో అమెరికాపై ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టింది. బార్బడోస్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా ఇంగ్లాండ్ బౌలర్లకు ధాటికి తక్కువ స్కోర్కే ఆలౌట్ అయ్యారు. 18.5 ఓవర్లలో 115 పరుగులు చేసి అమెరికా ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4 వికెట్ల తీసి అమెరికా పతనాన్ని శాసించాడు.
సామ్ కరాన్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. టాప్లే, లివింగ్ స్టో్న్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 9.4 ఓవర్లలోనే టార్గెట్ను ఛేజ్ చేసి ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. బట్లర్ 38 బంతుల్లోనే 83 పరుగులు చేయగా.. సాల్ట్ 25 పరుగులు చేసి ఇంగ్లాండ్కు ఘన విజయాన్ని అందించారు. తాజా గెలుపుతో ఇంగ్లాండ్ సెమీస్కు దూసుకెళ్లింది.