Crime News: జైలు వ్యానులో మహిళపై అత్యాచారం.. ఎక్కడంటే..?

by Disha Web Desk 3 |
Crime News: జైలు వ్యానులో మహిళపై అత్యాచారం.. ఎక్కడంటే..?
X

దిశ వెబ్ డెస్క్: చేసిన తప్పులు దిద్దుకుని.. మళ్ళీ ఎలాంటి తప్పులు చెయ్యకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నేరస్థులకు న్యాయస్థానం శిక్ష విదిస్తుంది. అయితే కుక్కతోక వంకర అన్నట్టు కొందరు నేరస్తులు ఎప్పటికీ వాళ్ళ బుద్ధి మార్చుకోరు. ఓవైపు శిక్ష అనుభవిస్తున్నా కొందరిలో ఎలాంటి మార్పు రాదు అనడానికి జైలు వ్యానులో మహిళలపై జరిగిన అత్యాచారమే నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ మహిళా ఖైదీని, ఇద్దరు పురుష ఖైదీలను చికిత్స నిమిత్తం రోహ్‌తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిజిఐఎంఎస్) కు జైలు వ్యానులో తీసుకు వెళ్లారు.

అయితే చికిత్స పూర్తి అయిన తరువాత మళ్ళీ ఖైదీలను వ్యాన్‌లో ఎక్కించారు. అనంతరం ఖైదీలతో వచ్చిన సిబ్బంది డాక్యుమెంట్ వర్క్‌లో నిమగ్నమైయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఖైదీలు కలిసి మహిళా ఖైదీకి స్పైక్డ్ శీతల పానీయం తాగించారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ మాటలు విని పోలీసులు నిర్ఘాంతపోయారు. ఇక మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడింన ఖైదీలు మనీష్, సతీష్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Read More..

తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణం

Next Story

Most Viewed