రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం..

by Sumithra |
రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం..
X

దిశ, కోరుట్ల రూరల్ : మండలంలోని వెంకటాపూర్, చిన్న మెట్ పెల్లి గ్రామాల మధ్య గల రైల్వే ట్రాక్ పై సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మృతుని ఒంటి పై బిర్లా సిమెంట్ కంపెనీకి చెందిన లోగో గల పసుపు రంగు టీ షర్ట్, మెరున్ కలర్ షర్ట్ ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా సంఘటన స్థలాన్ని రైల్వే పోలీస్ అధికారులు, కోరుట్ల ఎస్సై కిరణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story