accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

by Sridhar Babu |
accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
X

దిశ, కారేపల్లి : పాము కాటుకు గురై మోటార్ సైకిల్ పై చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన కారేపల్లి మండలంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేకలతండాలో జాటోత్‌ సైదులు(32)గ్రామ సమీపంలోని తన వ్యవసాయ భూమి వద్ద ఇంటి నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. పనులు చేస్తుండగా సైదులును పాము కాటేసింది. వైద్యం కోసం భయంతో హడావిడిగా తన దగ్గర పని చేస్తున్న ఛత్తీస్ ఘడ్ బస్థర్ జిల్లా కు చెందిన సములు కసబ్ (35) అనే వ్యక్తి ని మోటార్‌ సైకిల్‌పై ఎక్కించుకొని

ఆసుప్రతికి వస్తున్న క్రమంలో బైక్​ కల్వర్టును ఢీ కొట్టింది. మోటార్‌ సైకిల్‌ పై ఉన్న ఇరువురు తీవ్రగాయాలై పక్కనే పొలంలో పడిపోయారు. దీనిని చాలా సేపటి వరకు ఎవరూ గమనించలేదు. తర్వాత చుట్టు పక్కల పొలాలకు చెందిన రైతులు వారిని గమనించి ఖమ్మం అసుపత్రికి తరలించగా అప్పటికే వారు ఇద్దరు మృతి చెందారు. సైదులు తండ్రి వీరన్న హెల్త్ మినిస్టర్ క్యంప్ కార్యాలయంలో ఆ టెండర్గా చేస్తున్నాడు. కూలి పనుల కోసం సైదులు వద్ద కసబ్ పనుల్లో చేరి పది రోజులైంది. పాము కాటుకు గురై ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఒకరు..యజమానిని కాపాడే ప్రయత్నంలో మరొకరు ప్రాణాలు పోగొట్టుకున్నారు.



Next Story