రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

by Disha Web Desk 23 |
రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి
X

దిశ,పెద్దవంగర : ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. తెల్లవారుజామున కొరిపల్లి శివారు లచ్చిరాం తండా దగ్గర ఒక బైకు కొత్తగా వేస్తున్న మోరి గుంతలో పడి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఎడవెల్లి అశోక్,రాఘవ పురం(జలాల్పురం ) గ్రామానికి చెందిన బారాజు వెంకన్న బైక్‌పై వెళ్తూ పోలీస్ స్టేషన్ దగ్గర బ్రిడ్జి సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అదే కాకుండా ఉదయం తెల్లవారుజామున కొరిపల్లి గ్రామ స్టేజి వద్ద బైక్ అదుపు తప్పి మోరి గుంతలో పడి అమ్మాపురం జీకే తండాకు చెందిన గుగులోత్ రాధిక అక్కడకక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తోర్రుర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.



Next Story

Most Viewed