suicide : నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం… ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య

by Kalyani |
suicide : నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం… ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య
X

దిశ నాగర్ కర్నూల్/తెల్కపల్లి :- ఒకే ఊరిలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గౌరారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అదే గ్రామానికి చెందిన మేడం పరుశురాం (38) కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి 2 గంటల సమయంలో పరశురాం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం 7 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన దండు అమృతమ్మ (40) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు.

పరుశురాం మృతి చెందిన విషయం తెలిసి అమృతమ్మ ఆత్మహత్యకు పాల్పడిందని గ్రామస్తులు తెలిపారు. ఇద్దరి మృతికి వివాహేతర సంబంధమే కారణమా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అమృతమ్మ కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతుందని గ్రామస్తుల ద్వారా తెలిసింది. మృతుడు పరశురాంకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలు 15 ఏళ్ల క్రితం భర్తను, రెండేళ్ల క్రితం కుమారుడిని కోల్పోయింది. రెండు మరణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలకపల్లి ఎస్సై నరేష్ తెలిపారు.



Next Story

Most Viewed