ట్రాక్టర్ బోల్తా ముగ్గురు కూలీలు మృతి....

by Disha Web Desk 11 |
ట్రాక్టర్ బోల్తా ముగ్గురు కూలీలు మృతి....
X

దిశ, సుల్తానాబాద్ : పెద్ద‌ప‌ల్లి జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ సంఘటన సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లో చోటుచేసుకుంది. ఆదివారం మండలంలోని చిన్నబొంకూరుకు చెందిన మహిళా కూలీలు మియాపూర్ లో మక్కా జొన్న పెరటిలో పనిచేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళ కూలీలు రాధమ్మ, లక్ష్మి, వైష్ణవిలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed