ఆ జిల్లాలో కలకలం రేపుతున్న డిగ్రీ విద్యార్థిని హత్య..అసలు ఏం జరిగిందంటే?

by Jakkula Mamatha |
ఆ జిల్లాలో కలకలం రేపుతున్న డిగ్రీ విద్యార్థిని హత్య..అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: జిల్లాలో డిగ్రీ విద్యార్థిని(Degree Student)హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వడ్డేపల్లి అటవీ ప్రాంతంలో విద్యార్థి తలపై బండరాయితో మోది హత్య చేసిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఆదివారం మృతదేహాన్ని గమనించిన గొర్రెల కాపరులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు గుమ్మగట్ట మండలం సిరిగేదొడ్డి గ్రామానికి చెందిన యువతి అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోందని గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. మారెమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా యువతి ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. పండగ అనంతరం కళాశాలకు వెళ్లేందుకు బయలుదేరింది. దీంతో రాయదుర్గం నుంచి అనంతపురం వెళ్లేందుకు తండ్రి ఆమెను ఆర్టీసీ బస్సు ఎక్కించారు. ఆ తర్వాత పంపనూరు వద్ద బస్సు దిగిన యువతి ప్రియుడి ద్విచక్రవాహనంపై వడ్డేపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అక్కడే అటవీ ప్రాంతానికి చేరుకున్న ప్రేమికుల(Lovers) మధ్య ఏదో విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో యువతిని ప్రియుడే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తలపై బండరాయితో కొట్టడంతో యువతి మృతిచెందిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్దకు బాధిత(Victims) కుటుంబం చేరుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed