- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి వ్యక్తి బలి
దిశ, ములకలపల్లి : వంతెన నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కుటుంబం రోడ్డున పడింది. చావుకు రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ములకలపల్లికి చెందిన కొట్టే శ్రీను (40) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం గేదెలు మేపేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ములకలపల్లి-తాళ్లపాయ గ్రామాల మధ్య పాములేరు వాగుపై వంతెన నిర్మాణం జరుగుతుంది. పనుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం
వహించడంతో ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి బయటకు రాలేదు. స్థానిక ఎస్సై రాజమౌళి, అగ్నిమాపక సిబ్బంది శ్రీనుని బయటకు తీశారు. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. శ్రీను మీద ఆధారపడి కుమార్తెతో పాటు ముగ్గురు జీవిస్తున్నారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబం కావడంతో కుటుంబం రోడ్డునపడ్డట్లయింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన స్థానికులకు కాంట్రాక్టర్ రూ. 10 వేలు చెల్లించినట్లు తెలిసింది. కాంట్రాక్టర్ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.