భైంసా పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో బాలిక మృతి...

by Sumithra |
భైంసా పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో బాలిక మృతి...
X

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం ఓ బాలిక మృతి చెందింది. కుటుంబీకులు, బందువులు మాట్లాడుతూ కడుపునొప్పితో పల్లవి (13) అనే బాలికను కుబీర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ డాక్టర్ సలహాతో పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. కాగా నిన్న సాయంత్రమే అపరేషన్ కాగా, నేడు బాలిక మృతి చెందింది.

వైద్యుని నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆ డాక్టర్ పట్టాని, హాస్పిటల్ ని రద్దు చేయాలని ధర్నాకు దిగి డాక్టర్ డౌన్ డౌన్ అంటూ హాస్పిటల్ ముందు బైటాయించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ, ప్రైవేట్ ఆస్పత్రిని సైతం నెలకొల్పి ఇక్కడ, అక్కడ ట్రీట్మెంట్ విధులు ఎలా సాధ్యమని కుటుంబీకులు మండి పడుతున్నారు.

Next Story

Most Viewed