పీక్స్‌కు చేరిన అత్తాపూర్ అత్త కోపం.. గుటికెడు చాయ్ కోసం మర్డర్

by Bhoopathi Nagaiah |
పీక్స్‌కు చేరిన అత్తాపూర్ అత్త కోపం.. గుటికెడు చాయ్ కోసం మర్డర్
X

దిశ, వెబ్‌డెస్క్ : క్షణికావేశంలో ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కోపంలో చేసే పనులు ఎంతటి అనర్ధాలను, అగాధాలను సృష్టిస్తాయో ఈ ఘటన ఒక ఉదాహరణ. మేడ్చల్ జిల్లా పరిధిలోని అత్తాపూర్‌లో కోపాన్ని అదుపు చేసుకోలేని ఓ అత్త కోడలిని దారుణంగా హత్య చేసింది. కేవలం టీ పెట్టి ఇవ్వలేదనే కారణంతో కోడలి గొంతుకు చున్నీ బిగించి ప్రాణం తీసింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాసన్ నగర్‌లో నివాసం ఉంటున్న ఫర్జాన చాయ్ పెట్టి ఇవ్వమని కోడలు అజ్మీర బేగం(28)ను కోరింది. అయితే ఆ సమయంలో మరో పనిలో ఉన్న అజ్మీర బేగం చాయ్ పెట్టడానికి నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. క్షణికావేశానికి గురైన ఫర్జాన కోడలు అజ్మీర బేగం మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ వెంకటరామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం అత్త ఫర్జానను అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్డం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, కోడలును అత్త హత్య చేయడానికి చాయ్ ఒక్కటే కారణమా లేక ఇంకేదైన ఉన్నదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed