అనుమానస్పదంగా వ్యక్తి మృతి

by Disha Web Desk 11 |
అనుమానస్పదంగా వ్యక్తి మృతి
X

దిశ కోటగిరి : అనుమానస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం ఎత్తోండ గ్రామానికి చెందిన ఓన్నెలా వార్ నాగయ్య(50)అనే వ్యక్తి ఆదివారం రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో బయటకు వెళ్లి వస్తానని, తలుపులు తెరిచి ఉంచమని తన భార్య లక్ష్మి తో చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. బయటికి వెళ్లిన వ్యక్తి ఉదయం లేచి చూస్తే సరికి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులుకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై సందీప్ వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Next Story

Most Viewed