మొయినాబాద్‌లో దారుణం.. సిమ్మింగ్ ఫూల్‌లో పడి రెండో తరగతి బాలుడు మృతి

by Disha Web Desk 19 |
మొయినాబాద్‌లో దారుణం.. సిమ్మింగ్ ఫూల్‌లో పడి రెండో తరగతి బాలుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని సుజాత స్కూల్ తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. సిమ్మింగ్ ఫూల్‌లో పడి రెండో తరగతి విద్యార్థి మృతి చెందాడు. సమ్మర్ క్యాంప్‌లో భాగంగా సిమ్మింగ్‌కు వచ్చిన బాలుడు ఈత కొట్టేందుకు దిగి ఊపీరి ఆడక మృత్యువాత పడ్డాడు. అప్పటి వరకు కళ్లు ముందు హూషారుగా కనిపించిన కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి మృతుడి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. పీఈటీ నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడి తల్లిదండ్రులు పీఈటీని చితక బాదారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed