- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
పసుపు ప్యాకెట్ల మాటున గంజాయి విక్రయాలు.. అక్రమార్కుల నయా పోకడలు..
దిశ, కార్వాన్ : రెండు రోజుల క్రితం చాక్లెట్, కేక్, విస్కీ లో గంజాయి విక్రయాలు జరిగాయి. ఇప్పుడు పసుపు ప్యాకెట్లలో గంజాయి విక్రయాలకు అక్రమార్కులు కొత్త దారులకు తెరలేపారు. ఎక్సైజ్ దాడుల్లో రోజుకొకటి బయట పడుతున్నాయి. బంజారాహిల్స్ లోని ఒక ఐస్ క్రీమ్ దుకాణంలో మద్యాన్ని వినియోగించి చాక్లెట్ తయారు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పబ్ పై దాడి చేసినప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్న సంఘటనలు బయట పడుతూ వస్తున్నాయి. డ్రగ్స్ పై కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులకు రెండు రోజులు గడవక ముందే పసుపు విక్రయాల మాటున గంజాయి అక్రమంగా విక్రయాలు చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
దూల్పేట్ కి చెందిన నేహా భాయ్ అనే మహిళ.. పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి అమ్మకాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డి.ఎస్.పి తిరుపతి యాదవ్, ఎస్సై నాగరాజు తో పాటు ఎక్సైజ్ సిబ్బంది కలిసి, అక్రమంగా గంజాయి నీ పసుపు ప్యాకెట్ లో విక్రయాలు జరుపుతున్న ఇంటి పై దాడి చేసి 10 గంజాయి పాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు.ఈ ఆపరేషన్ లో పాల్గొన్న టీం ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు.