లారీ-బైక్ ఢీ.. ఒకరి మృతి

by Vinod kumar |
లారీ-బైక్ ఢీ.. ఒకరి మృతి
X

దిశ, కాటారం : లారీ బైక్ ఢీ ఒకరి మృతి ఒకరు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని 3503 జాతీయ రహదారిపై లారీ, బైక్ ఢీ కొట్టాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన విషయాల ప్రకారం.. జాతీయ రహదారిపై కమలాపూర్ ఎక్స్ రోడ్‌కు సమీపంలో కాటారం వైపు వస్తున్న లారీకి, భూపాలపల్లి వైపు వెళ్తున్న బైక్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో మలహర్ మండలం నాచారం గ్రామానికి చెందిన చింతల పెళ్లి రాజు (30) మరణించాడు. దీంతో లారీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని కాటారం ఎస్సై అభినవ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed