Road Accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే యువతి దుర్మరణం

by Shiva |
Road Accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే యువతి దుర్మరణం
X

దిశ, అలంపూర్/ఎర్రవల్లి: జోగులాంబ గద్వాల జిల్లాలోని 44 జాతీయ రహదారిపై ధర్మారం స్టేజీ సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ.. వరుస సెలవుల నేపథ్యంలో లిఖితారెడ్డి, తమ స్నేహితుడితో కలిసి తమ సొంతూరు కర్నూలుకు బయలుదేరారు. ఈ క్రమంలోనే వారు ధర్మారం స్టేజీ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లిఖితారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమె స్నేహితునిడికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన హైవే అంబులెన్స్‌లో కర్నూల్ తరలించించారు. అయితే, వారంతట వారు ప్రమాదానికి గురయ్యారా.. వేరే వాహనం ఏదైనా ఢీకొట్టిందా అనేవిషమం తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా వారిద్దరూ కర్నూలు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed