మల్లారం అటవీ ప్రాంతంలో నేరడిగొండవాసి దారుణ హత్య

by Disha Web Desk 15 |
మల్లారం అటవీ ప్రాంతంలో నేరడిగొండవాసి దారుణ హత్య
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మల్లారం అటవీప్రాంతంలో నిర్మల్ జిల్లా నేరడిగొండవాసి హత్యకు గురయ్యాడు. ఆదివారం నేరడిగొండ పోలీస్ లు స్థానిక పోలీస్ ల సహాయంతో ఘటన జరిగిన స్థలానికి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీస్ ల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 22న అదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంకు చెందిన వ్యక్తి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో అతని కుటుంబ సభ్యులు పోలీస్​లకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ అయిన వ్యక్తి కోసం గాలించిన

పోలీస్ లు అతడి ఆచూకీ లేకపోవడంతో సెల్ ఫోన్ రికార్డులను పరిశీలించారు. అతడు మిస్సింగ్ తరువాత చివరగా ఎవరితో మాట్లాడారో ఆరా తీశారు. చివరగా మాట్లాడిన నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నివాసిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు నేరడిగొండ వాసి మల్లారం ప్రాంతంలో చనిపోయాడని తెలపడంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఓ వ్యక్తిని కాల్చి వేసిన ఆనవాళ్లు ఉన్నాయి. అత్మహత్య చేసుకోవడంతో కాల్చి వేసినట్లు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి తెలిపాడు. ఐతే అత్మహత్య చేసుకుంటే ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా కాల్చివేయాల్సి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నేరడిగొండ వాసికి నిజామాబాద్ వాసికి సోషల్ మీడియాలోని ఓ ఆన్ లైన్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. కాగా నేరడిగొండ వాసి హత్యకు అక్రమ సంబంధమే కారణమనే కోణంలో పోలీస్ లు విచారిస్తున్నారు.

Next Story

Most Viewed