- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భారీ చోరీ.. 40 తులాల బంగారం, రూ.10లక్షలు అపహరణ
దిశ, గద్వాల: యజమాని ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు వెళ్లి వచ్చేసరికి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి భారీగా బంగారం ఆభరణాలు, నగదు అపహరించుకు పోయిన సంఘటన గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగ బాయి కాలనీలో చోటు గురువారం చేసుకుంది. పోలీసులు, బాధితుల తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల పట్టణం లింగం బాయి కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం బెంగుళూరుకు వెళ్ళాడు.
గురువారం తెల్లవారుజామున వెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు రాజేష్ ఇంటికి రాగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువా పగులగొట్టి వస్తువులు చిందరవందరంగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను,నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమందించాడు. బీరువాలో ఉన్న 40 తులాల బంగారం ఆభరణాలతో సుమారు రూ.10 లక్షల నగదు అపహరణకు గురైందని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ క్లూస్ టీం తో ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు.