సెల్లార్ గుంతలో పడి వ్యక్తి మృతి..

by Sumithra |
సెల్లార్ గుంతలో పడి వ్యక్తి మృతి..
X

దిశ, పేట్ బషీరాబాద్ : ఉద్యోగం కోసం నగరానికి వచ్చి సెల్లార్ నిర్మాణం కోసం తీసిన పురాతన గుంతలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా చిన్నతడూరు గ్రామానికి చెందిన నాగనాథ్ (24) 30 రోజుల క్రితం ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చాడు. కొంపల్లి సెంట్రల్ పార్క్ లో ఉన్న మహాలక్ష్మి హాస్టల్ లో ఉంటున్న నాగనాథ్ ఆగస్టు 31న హాస్టల్ నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కాగా మంగళవారం సెల్లార్ గుంతలో వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రేన్ సహాయంతో సెల్లార్ గుంతలో ఉన్న మృతదేహాన్ని పెట్ బషీరాబాద్ పోలీసులు బయటకు తీసి మార్చురీకి తరలించారు. అయితే మద్యం తాగిన మత్తులోనే ఆ గుంతలో పడిపోయి ఉంటాడని తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed