పోలీసుల అదుపులో దొంగ నోట్ల ముఠా...?

by Bhoopathi Nagaiah |
పోలీసుల అదుపులో దొంగ నోట్ల ముఠా...?
X

దిశ, మెట్‌పల్లి : జగిత్యాల జిల్లాలో దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు 8 మంది ముఠా సభ్యుల్లో నలుగురిని అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారైనట్లు తెలుస్తోంది. వీరిని మెట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ముఠాలో నలుగురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా ప్రధాన సూత్రధారి జగిత్యాల జిల్లా పట్టణానికి చెందిన వ్యక్తి ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి వద్ద నుండి సుమారు రూ.15 లక్షల నకిలీ నగదు పట్టుకున్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed