- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళితే ప్రాణమే పోయింది
by Sridhar Babu |
X
దిశ,కరీంనగర్ రూరల్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అభం శుభం తెలియని ఓ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిన ఘటన శనివారం కరీంనగర్ లోని ఓ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన బోలాగం అనిల్-శిరీష దంపతులకు చెందిన
ఆయాన్స్ అనే 5 సంవత్సరాల బాలుడికి జ్వరం వచ్చిందని కరీంనగర్ లోని ఆద్య పిల్లలు హాస్పిటల్ కి తీసుకుని వచ్చారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న వైద్యులు బాలుడికి ఇంజక్షన్ ఇవ్వడంతో వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
Advertisement
Next Story