దంతెవాడలో ఎదురుకాల్పులు.. జవాన్ మృతి

by Disha Web Desk 4 |
దంతెవాడలో ఎదురుకాల్పులు.. జవాన్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా హందవాడలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో జవాన్ జోగారం కర్మ మృతి చెందారు. మరో జవాన్ పరశురాం పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దంతెవాడ జిల్లా బార్సూర్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. హందవాడ, హితవాడలో మావోలు ఉన్నారనే సమాచారంతో సోదాలు నిర్వహించారు. దంతెవాడ డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్ సంయుక్త బృందం సోదాలు నిర్వహించింది. ఈ సమయంలో గస్తీ బృందంపై ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులకు దిగారు. కాల్లుల్లో దంతెవాడ డీఆర్‌జీ కానిస్టేబుల్ జోగరాజ్ కర్మ మృతి చెందగా.. మరో కానిస్టేబుల్ పరశురామ్‌కు గాయాలు అయ్యాయి. కానిస్టేబుల్ పరశురామ్ ను చికిత్స నిమిత్తం రాయ్ పూర్ తరలించారు.



Next Story

Most Viewed