ఘోర రోడ్డు ప్రమాదం.. పప్పు లోడుతో వెళ్తోన్న లారీ బోల్తా

by Gantepaka Srikanth |
ఘోర రోడ్డు ప్రమాదం.. పప్పు లోడుతో వెళ్తోన్న లారీ బోల్తా
X

దిశ, కాకినాడ: కాకినాడ జిల్లా అన్నవరం నూతన నమూనా ఆలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టు వద్ద వెస్ట్ బెంగాల్‌కు చెందిన లారీ, క్రేన్ వాహనం ఢీకొట్టడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. కత్తిపూడి నుండి విశాఖపట్నం వైపు పప్పులోడుతో ఓ లారీ వెళ్తోంది. అదే సమయంలో వెళుతున్న క్రేన్ వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. ఆ తాకిడికి పప్పు లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో ఎటువంటి ప్రాణాపాయం లేదు. విజయవాడకు చెందిన కోన దుర్గారావుకు తలకు తీవ్ర గాయాలవ్వడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed