- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఘోర రోడ్డు ప్రమాదం.. పప్పు లోడుతో వెళ్తోన్న లారీ బోల్తా
by Gantepaka Srikanth |
X
దిశ, కాకినాడ: కాకినాడ జిల్లా అన్నవరం నూతన నమూనా ఆలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టు వద్ద వెస్ట్ బెంగాల్కు చెందిన లారీ, క్రేన్ వాహనం ఢీకొట్టడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. కత్తిపూడి నుండి విశాఖపట్నం వైపు పప్పులోడుతో ఓ లారీ వెళ్తోంది. అదే సమయంలో వెళుతున్న క్రేన్ వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. ఆ తాకిడికి పప్పు లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో ఎటువంటి ప్రాణాపాయం లేదు. విజయవాడకు చెందిన కోన దుర్గారావుకు తలకు తీవ్ర గాయాలవ్వడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story