తిరుమల ఘాట్ రోడ్‌లో జీపు బోల్తా..భక్తులకు గాయాలు

by Disha Web Desk 18 |
తిరుమల ఘాట్ రోడ్‌లో జీపు బోల్తా..భక్తులకు గాయాలు
X

దిశ,తిరుమల: తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఆదివారం ఓ జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు గాయపడింది. చెన్నైకు చెందిన ఐదు మందితో కూడిన భక్తబృందం శ్రీవారి దర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం ఏపీ 20 టీవీ 0204 నెంబరు గల జీపులో తిరుమలకు బయలుదేరారు. మార్గంలో జీపు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 50 ఏళ్ల వయస్సు కలిగిన ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా, మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కాగా, ప్రమాదానికి గురైన జీపును అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.



Next Story