- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
హీరో రాజ్ తరుణ్ లవ్ ఎఫైర్ కేసులో బిగ్ ట్విస్ట్
దిశ, వెబ్డెస్క్ : హీరో రాజ్ తరుణ్- లావణ్య లవ్ ఎఫైర్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. హీరో రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకుని మరో హీరోయిన్తో ప్రేమలో పడి తనను వదిలేసి వెళ్లిపోయాడని, గతంలోనే ఇద్దరం కలిసి సీక్రెట్గా గుళ్లో పెళ్లి చేసుకున్నామని లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసుపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. అసలు మోసం చేసిందే లావణ్య అంటూ బాంబ్ పేల్చాడు. లావణ్య నన్ను టార్చర్ చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు రిలేషన్లో ఉన్నది నిజమే కానీ తామిద్దరం గుళ్లో పెళ్లి చేసుకున్నాం అన్నది పచ్చి అబద్దం అన్నారు. ఆమె చెప్పేవి అన్ని అబద్దాలని కొట్టిపారేశారు. లావణ్య డ్రగిస్టని, బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. తన జీ మెయిల్ కూడా హ్యాక్ చేసిందని చెప్పారు. నన్నే కాదు వాళ్ల నాన్నను కూడా ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. ఆమెపై మూడు డ్రగ్ కేసులు నమోదు అయ్యాయి. ఆమె పెట్టే టార్చర్ భరించలేకే దూరంగా ఉంటున్నాను. ఈ విషయంపై డీసీపీకి కలిసి మాట్లాడాను. ఇప్పుడు కావాలని రాద్దాంతం చేస్తూ నా కెరీర్ను నాశనం చేయాలని ప్రయత్నిస్తోంది అంటే రాజ్ తరుణ్ విమర్శలు గుప్పించారు.
మరోవైపు రాజ్ తరుణ్, లావణ్య ఎపిసోడ్లో ఓ హీరోయిన్ ఉన్నట్లు తాజా ఫిర్యాదులో వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకోనే తనను దూరం పెట్టాడని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా కలిసి ‘తిరగబడరా సామీ’ సినిమా నటించారని తెలిపింది. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పండిందని అప్పటినుంచి నన్ను అడ్డుతప్పుకోవాలని బెదిరిస్తున్నారని, తప్పుకోకపోతే చంపేస్తామన్నారని తెలిపింది. మాల్వీ మల్హోత్రా , ఆమె సోదరుడు కలిసి హిమాచల్ ప్రదేశ్ సీఎం మా నాన్న ఫ్రెండ్ అని, నువ్వు అడ్డుతప్పుకోకపోతే ఏమైనా చేస్తామని బెదిరించామని లావణ్య తెలిపింది. వాళ్ల ట్రాప్లో పడే రాజ్ తరుణ్ తనకు దూరమయ్యాడని లావణ్య చెబుతోంది. తన్ను తప్పుకోవాలని డబ్బు ఆశ కూడా చూపించారని ఆరోపణలు చేసింది. మాల్వీ మల్హోత్రా కోసమే రాజ్ తరుణ్ తరచూ ముంబై వెళ్తున్నాడని వివరించింది. పోలీసులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. కాగా, లావణ్య చేస్తున్న ఆరోపణలు అన్నీ పచ్చి అబద్దాలని రాజ్ తరుణ్ కొట్టిపారేశారు. టాలీవుడ్లో రచ్చ రచ్చ అవుతున్న ఈ కేసు ఏ మలుపుతిరుగుతుందో చూడాలి.