ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

by Sridhar Babu |
ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
X

దిశ ,మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన సోమవరపు మణి (32) మధ్యాహ్నం సమయంలో బ్రహ్మం గారి గుడి వెనకాల గల మిషన్ భగీరథ ట్యాంక్ పక్కన గల కాల్వ వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. కాలువలో దిగుతూ ప్రమాదవశాత్తు మూర్చ వ్యాధి వచ్చి కాలువలో పడి మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story