పానీపూరీ కోసం బయటికి వెళ్లిన యువకుడు.. ఏమైపోయాడో పాపం..

by Sumithra |
పానీపూరీ కోసం బయటికి వెళ్లిన యువకుడు.. ఏమైపోయాడో పాపం..
X

దిశ, మేడిపల్లి : పానీపూరి తినడానికి వెళ్లిన వ్యక్తి అదృష్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుదర్శన్ నగర్ కాలనీ, మేడిపల్లికి చెందిన మాలోతు పవన్ తన తమ్ముడు మాలోతు నవీన్ (21) ఆదివారం సాయంత్రం పానీపూరి తినివస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఎంతసేపయినా ఇంటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో అన్న పవన్ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story