accident : జేసీబీ ఢీకొని యువకుడు మృతి

by Sridhar Babu |
accident : జేసీబీ ఢీకొని యువకుడు మృతి
X

దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలం తాటిపెళ్లి గ్రామంలో జేసీబీ ఢీకొని యువకుడు మృతి చెందాడు. కోరుట్ల పట్టణానికి చెందిన పోతుగంటి గౌతమ్( 25) రాయికల్ మండలంలోని అల్లిపూర్ గ్రామంలో ఉన్న తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి బైక్ పై వెళ్లి కోరుట్ల కు తిరిగి వెళుతూ ఉండగా తాటి పెళ్లి గ్రామంలో జేసీబీ యజమాని తన ఇంట్లోకి వెళ్లే సమయంలో కుడివైపునకు తిప్పగా

జేసీబీ వెనుక భాగంలోని బకెట్ కు గౌతమ్ తల తాకడంతో ఎగిరి కొంత దూరంలో పడి అక్కడికక్కడే చనిపోయాడు. గౌతమ్ గత వారం రోజుల కిందట కత్తర్ నుండి వచ్చాడు. అతి వేగంగా బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జగిత్యాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, బైకును, జేసీబీని జగిత్యాలోని రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed