- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
సలబత్పూర్ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..
by Sumithra |
X
దిశ, జక్రాన్ పల్లి : పొలంకు వెళ్లి వస్తానని వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలబత్పూర్ గ్రామానికి చెందిన దండల్వర్ బాలాజీ (37) అనే వ్యక్తి అంకాపూర్ గ్రామంలో నివాసం ఉంటూ మండలంలోని ఆర్గుల్ గ్రామ శివారులో తాను కౌలుకి చేస్తున్న పొలం వద్ద అనుమానస్పదంగా మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లి తిరిగి రాకపోగా అతని తమ్ముడు ప్రకాష్ పొలం వద్ద వెతకగా ఆదివారం రాత్రి సుమారు 8 గంటలకు చనిపోయి పడి ఉన్నాడని తెలిపారు. అతని భార్య దండల్వర్ శోభ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Next Story