Accident : బైక్‌ను ఢీకొన్న బస్సు.. మహబూబ్‌నగర్ జిల్లా వాసి మృతి

by Aamani |
Accident : బైక్‌ను ఢీకొన్న బస్సు.. మహబూబ్‌నగర్ జిల్లా వాసి మృతి
X

దిశ,మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా వాసి మోహన్ (26), నాచారం లో నివసిస్తు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడం తో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.



Next Story