తెలంగాణలో కొత్తగా 502 కరోనా కేసులు

by vinod kumar |
తెలంగాణలో కొత్తగా 502 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 502 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,70,318కి చేరింది. కొత్తగా వైరస్ బారినపడి ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1461కి పెరిగింది. తాజాగా మహమ్మారి బారినుంచి 894 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,59,230కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 9627 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు 95.89 శాతానికి చేరింది. తాజాగా GHMC పరిధిలో 101 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ బల్దియా ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో.. కరోనా కేసులు తక్కువగా నమోదు కావడం ఓటర్లకు ఉపశమనం కలిగించే అంశం.

Advertisement

Next Story

Most Viewed