దారుణం: 5 ఏళ్ల బాలుడిని ఢీ కొట్టిన కారు..

by Sumithra |   ( Updated:2021-07-29 22:10:42.0  )
దారుణం: 5 ఏళ్ల బాలుడిని ఢీ కొట్టిన కారు..
X

దిశ, అశ్వారావుపేట : మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో బాలుడు మృతి చెందిన ఘటన దమ్మపేట మండలంలోని గురవాయిగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గురవాయిగూడెం గ్రామానికి చెందిన సోడెం సురేష్ కుమారుడు సొడేం లక్కీ (5) తన తాతయ్యతో కలిసి కిరాణా దుకాణం వద్ద వచ్చాడు.

అదే సమయంలో రోడ్డు పక్కనే నిల్చున్న బాలుడు లక్కీ నీ పాల్వంచ వైపు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కార్ అతి వేగంగా ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన బాలుడిని హుటాహుటిన అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడు తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ కారును ఆపకుండా పరారీ అయినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story