అంగన్‌వాడీ కేంద్రంలో 40పాములు, తేళ్లు

by Shyam |
అంగన్‌వాడీ కేంద్రంలో 40పాములు, తేళ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : మహాబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణపల్లి అంగన్ వామీ కేంద్రంలో ఈరోజు ఉదయం 40 పాము పిల్లలు, 2 తేళ్లు కనిపించాయి. పాములు కనిపించడంతో అంగన్‌వాడీ సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అంగన్‌వాడీ కేంద్రానికి పిల్లలు ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

చిన్నారులతో పాటు గర్భిణులకు సరకులు పంచేందుకు భవనం తెరవడంతో పాములు కనిపించినట్టు అంగన్‌వాడీ సిబ్బంది పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనంలో అంగన్ వాడీ కేంద్రం నడపడం వల్లే ఇలా పాములు, తేళ్లు వస్తున్నాయని సిబ్బంది, స్థానికులు తెలిపారు.

Next Story

Most Viewed