ఆ కుటుంబంలోని మగళ్లాంతా కలిసి మహిళపై అత్యాచారం

by  |
ఆ కుటుంబంలోని మగళ్లాంతా కలిసి మహిళపై అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: కామంతో కళ్లుమూసుకు పోయిన ఓ కుటుంబం చేసిన పని సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. దాని గురించి అందరికీ తెలియడంతో వీళ్లు మనుషులా లేక మృగలా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఇంట్లో పనిచేస్తున్న ఓ పనిమనిషిపై ఓ కుటుంబంలోని మగాళ్లంతా ఆమెను బంధించి చిత్రహింసలకు గురిచేస్తూ మూడ్రోజులుగా అఘాయిత్యానికి ఒడిగడుతూ వచ్చారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..

తమ ఇంట్లో దొంగతనం జరిగిందనే నెపంతో పనిమనిషి పై తాత, తండ్రి, కొడుకు ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. మహిళ వయస్సు 40 ఏండ్లు. అత్యాచారం చేసిన కిరాత‌కులు తాత, తండ్రి, కొడుకు రిలేషన్ ఉన్నవారు కావడంతో ఈ విషయం స్థానికంగా సంచలనం రేపింది. తమ ఇంట్లో దొంగతనం జరిగిందని నిజం తేలే వరకూ వదిలేది లేదని ఆమెను బంధించారు. మూడ్రోజుల పాటు అత్యాచారం చేస్తూ.. ఆ మహిళకు నరకం చూపించారు. ఎలాగో తప్పించుకున్న బాధితురాలు చివరకు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.

బాధితురాలు సోనం( పేరు మార్చాం) అక్కడే ఉన్న రణ్ వీర్( పేరుమార్చాం) ఇంట్లో పనిచేస్తోంది. గత వారం వారి ఇంట్లో పెద్ద ఎత్తున నగదు, బంగారం మాయం అయ్యాయి. ఈ దొంగతనం వెనుక తమ ఇంట్లోని వారే హస్తముందని తొలుత భావించినా.. కానీ అందరి వేళ్లు బాధితురాలు సోనం వైపే చూపాయి. దీంతో సోనంను గదిలో బంధించి తమ డబ్బు ఎక్కడుందో చెప్పాలంటూ హింసించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇంటియజమాని రణ్ వీర్ బాధితురాలిపై అత్యాచారం చేశాడు. అనంతరం కుమారుడు, అలాగే రణ్‌వీర్ తండ్రి కూడా అత్యాచారం చేశాడు. ముగ్గురూ కలిసి మూడు రోజుల పాటు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఎట్టకేలకు ఆమె అక్కడనుంచి తప్పించుకుని తన కుటుంబ సభ్యులను క‌లిసింది. బాధితురాలు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి పోలీసులను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివ‌రించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story