5వేల మార్క్ దాటిన కేసులు

by vinod kumar |
5వేల మార్క్ దాటిన కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఐదు వేల మార్క్ దాటాయి. హైదరాబాద్ నగరంలో కరోనా కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 219 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో ఇద్దరు కరోనా కారణంగా మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,193కు, మొత్తం మృతుల సంఖ్య 187కు చేరుకుంది. సోమవారం నమోదైన 219 కేసుల్లో జీహెచ్ఎంసీలో 189, రంగారెడ్డిలో 13, వరంగల్ అర్బన్‌లో నాలుగు, వరంగల్ రూరల్‌లో మూడు, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు, వనపర్తి, పెద్దపెల్లి, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి జిల్లాల్లో ఒక్కోటి చొప్పున నమోదయ్యాయి. మంగళవారం నుంచి మరింత ఎక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారణ టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున హైదరాబాద్ నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed