తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు

by vinod kumar |
తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు
X

దిశ,వెబ్ డెస్క్ : కరోనా కేసుల సంఖ్య రోజు రోజు పెరుగుతోంది. తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 35 మందికి కరోనా సోకినట్టు తెలిపింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 166 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,681 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,654గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,983 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. వారిలో 718 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

Advertisement

Next Story