దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

by Shamantha N |
carona 1
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలీస్తే ఈ రోజు మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గాయి. ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 1,14,460 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,09,339కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 2677 మంది మరణించారు. అదే సమయంలో 1,89,232 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,46,759కు పెరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు2,69,84,781 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,77,799 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో కొంత మంది హో ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed