ఏపీలో కొత్తగా 10,368 పాజిటివ్ కేసులు

by  |
ఏపీలో కొత్తగా 10,368 పాజిటివ్ కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా రాష్ట్రంలో 10,368 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు నాలుగు లక్షల 45 వేల 139 కి చేరింది. అంతేగాకుండా గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారిన పడి 84 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 4,053 చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 1,210 కాగా, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3 లక్షల 39,876కు చేరింది.


Next Story

Most Viewed