లాటరీలో జాక్‌పాట్.. రూ.9,418 కోట్లను గెల్చుకున్న వ్యక్తి

by Disha Web Desk 17 |
లాటరీలో జాక్‌పాట్.. రూ.9,418 కోట్లను గెల్చుకున్న వ్యక్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఒక వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. మెగా మిలియన్స్ అని పిలవబడే లాటరీ గేమ్‌లో ఒక విజేత భారీ మొత్తం గెలుచుకున్నాడు. లాటరీ అధికారులు మంగళవారం డ్రా తీయగా దానిలో ఒక వ్యక్తికి దాదాపు రూ.9,418 కోట్ల($1.13 బిలియన్ల) గెల్చుకున్నాడని గేమ్ అధికారులు తెలిపారు. అయితే అతను ఎవరనేది ఇంకా తెలియరాలేదు. జాక్‌పాట్ చరిత్రలో ఇది ఐదవ అతిపెద్ద లాటరీ. విజేత మొత్తం అమౌంట్‌ను ఏకమొత్తంలో ఒకేసారి లేదా వార్షిక వాయిదాలలో 30 సంవత్సరాలకు పైగా పొందే అవకాశం ఉంది. అయితే దీనిలో పన్ను చెల్లింపులు మొదలైనవి కూడా ఉంటాయి. ఇంతకుముందు ఆగస్ట్ 8, 2023న ఫ్లోరిడాలో రూ.13,352 కోట్ల($1.602 బిలియన్ల) విలువైన జాక్‌పాట్‌ను విక్రయించారు. ఆల్ టైమ్ అమెరికాలో అతిపెద్ద లాటరీ జాక్‌పాట్ నవంబర్ 2022లో కాలిఫోర్నియాలో కొనుగోలు చేసిన టికెట్ ద్వారా రూ.17 వేల కోట్ల($2.04 బిలియన్ల)ను అందించారు.


Next Story