Ukraine : ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. నలుగురి మృతి, 37 మందికి గాయాలు

by Hajipasha |
Ukraine : ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. నలుగురి మృతి, 37 మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : తమ భూభాగంలోకి చొచ్చుకొస్తున్న ఉక్రెయిన్ ఆర్మీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈనేపథ్యంలో పుతిన్ ఆదేశాలతో ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా వాయుసేన యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని చెర్నిహివ్, సుమీ, ఖార్ఖీవ్, డొనెస్క్ ప్రాంతాలపై బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో నలుగురు ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, 37 మందికి గాయాలయ్యాయి.

ప్రాంతాలవారీగా చూస్తే.. సుమీ ప్రాంతంలో ఒకరు చనిపోగా, 16 మందికి గాయాలయ్యాయి. ఖార్ఖీవ్ ప్రాంతంలో 13 మందికి గాయాలయ్యాయి. ఖేర్సన్ ప్రాంతంలో ఒకరు చనిపోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ ప్రాంతపు గగనతలంపై 9 రష్యా సైనిక డ్రోన్లు చక్కర్లు కొట్టగా.. వాటిలో ఎనిమిదింటిని ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసింది.

Advertisement

Next Story