రేపు రేవంత్‌కి బాధ్యతలు ఇస్తా: ఉత్తమ్ కీలక ప్రకటన

by  |
Uttam Kumar Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పీసీసీగా ఉండకపోయినా ప్రతీ కార్యకర్తకూ అండగా ఉంటానని, సోనియా నియమించిన పీసీసీ కొత్త కమిటీకి అభినందనలు అని తెలిపారు. రేపు కొత్త టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బాధ్యతలు ఇస్తానన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై ఉత్తమ్ స్పందించారు. ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత నీటి దోపిడీ ఎక్కువైందని, దీనిపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని ఉత్తమ్ చెప్పారు. పోతిరెడ్డిపాడు నుంచి 8 టీఎంసీల నీటి తరలింపు దుర్మార్గమైన చర్య అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed