పండే కదా అని పట్టుకుంటే.. చెయ్యి కోసేస్తా! కత్తులు పట్టుకున్న షాపు సిబ్బంది

by Ramesh N |   ( Updated:2024-05-20 13:08:12.0  )
పండే కదా అని పట్టుకుంటే.. చెయ్యి కోసేస్తా! కత్తులు పట్టుకున్న షాపు సిబ్బంది
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైల్లో దొంగతనాలు తరుచుగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే రైల్వే సిబ్బంది ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంటారు. అర్థరాత్రి సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు దొంగలు తమ చేతివాటం చూపిస్తుంటారు. అయితే దీనికి భిన్నంగా ప్రయాణికులే తమ చేతివాటం ఓ రైల్వే స్టేషన్‌లో ప్రదర్శిస్తున్నట్లు ఉంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో కన్పిస్తున్న ప్రకారం.. రైలు పట్టాలకు దగ్గరగా అనుకోని కొన్ని పండ్ల దుకాణాలు ఉన్నాయి. పండ్ల దుకాణాలకు ద్రాక్ష గుత్తులు వేలాడదీసి ఉన్నాయి. ఎవరైనా ట్రైన్ డోర్ నుంచి ద్రాక్ష గుత్తులను అమాంతం ఎత్తుకు పోయేంత దగ్గరగా ఉన్నాయి.

అయితే రైలు వస్తున్న క్రమంలో ద్రాక్ష గుత్తులను ట్రైన్ డోర్ వద్ద ఉన్న ప్రయాణికులు తస్కరించకుండా ఉండేందుకు షాపు యజమానులు కత్తులు, కట్టెలు రెడీగా పెట్టుకొని ఉన్నారు. ఎవరైనా అవి ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తే వారి చెయ్యి మాత్రం కట్ అవుతుంది. ఈ నేపథ్యంలో కత్తులు గమనించిన ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారు.. కానీ దొంగతనం చేసే సాహసం మాత్రం చేయలేదు. దీనికి సబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో జరిగిందని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఇది వరకు పండ్లను కొందరు ప్రయాణికులు పండ్లను ఎత్తుకుపోయి ఉండొచ్చని అందుకే వారు ముందు జాగ్రత్తగా అలా ప్రవర్తించారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు పండే కదా అని పట్టుకుంటే చెయ్యి కోసేస్తా అనే విధంగా షాపు యజమానులు కత్తులు పట్టుకుని రెడీగా ఉన్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Click Here For Twitter Post..

Advertisement

Next Story