BIG News: బీఎస్ఎన్ఎల్ కనివినీ ఎరుగని బంపర్ ఆఫర్.. క్యూ కడుతోన్న కొత్త కస్టమర్లు

by Shiva |
BIG News: బీఎస్ఎన్ఎల్ కనివినీ ఎరుగని బంపర్ ఆఫర్.. క్యూ కడుతోన్న కొత్త కస్టమర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: టెలికం రంగంలో ప్రైవేటు కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్-ఐడియా)ల గుత్తాధిపత్యం పెరిగిపోయింది. ధనార్జనే లక్ష్యంగా కార్పొరేట్ సంస్థలు టారీఫ్ రేట్లను విపరీతంగా పెంచేశాయి. ఈ క్రమంలోనే పక్కా ప్రభుత్వ రంగ టెలికం ఆపరేటర్ అయిన బీఎస్‌ఎన్ఎల్‌ సరికొత్త టారీఫ్‌లతో ప్రైవేటు రంగ సంస్థలకు సవాలు విసురుతోంది. బంపర్ ఆఫర్లను ప్రకటిస్తూ.. రోజురోజుకు తమ కస్టమర్ల సంఖ్యను క్రమంగా పెంచుకుంటోంది. మరోవైపు ప్రకటించిన ఆఫర్లు కూడా పేద, మధ్య తరగతి కస్టమర్లకు అందుబాటులో ఉండటంతో చాలామంది బీఎస్ఎన్‌ఎల్‌లోకి పోర్ట్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

సగటు నెలవారీగా ప్లాన్ వెతుకుతున్న కస్టమర్లే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ రూ.147తో 30 రోజుల ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో తీసుకునే కస్టమర్లు నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు 10 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. దేశంలో ఇతర ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. కాలర్ ట్యూన్‌ సేవలను కూడా ఉచితంగానే సెట్ చేసుకునే అవకాశం కల్పించారు. తక్కువ ఖర్చుతో నెల ప్లాన్‌ను పొందాలనుకునే వారికి ఇదో సూపర్ ఆఫర్‌గా కనిపిస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వీ వంటి ప్రముఖ టెలికం కంపెనీలు ఇంత తక్కువ ధరకు 30 రోజుల రీఛార్జ్ ప్లాన్‌ను అందించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed