బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలుగువారికి పెద్దపీట

by srinivas |
BJP logo
X

దిశ, ఏపీ బ్యూరో: బీజేపీ జాతీయ నూతన కార్యవర్గాన్ని బీజీపీ అధిష్టానం గురువారం ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. ఈ కార్యవర్గంలో తెలుగువారికి పెద్దపీట వేశారు. జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మరో మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావులకు చోటు లభించింది. అలాగే ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు కూడా జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు కల్పించారు.

ఇక ఆఫీస్ బేరర్లలో తెలంగాణ నుంచి డీకే అరుణను నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏపీకి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శిగా ఏపీ నుంచి సత్యకుమార్‌ను నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్‌లకు స్థానం లభించింది.

Next Story

Most Viewed