నా తలనొప్పి తిరిగొచ్చింది: క్రికెటర్ అంబటి రాయుడు

by Disha Desk |
నా తలనొప్పి తిరిగొచ్చింది: క్రికెటర్ అంబటి రాయుడు
X

బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 వేలం ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. సీజన్ 15 లో భాగంగా రెండు కొత్త జట్లు ఈ ఏడాది సందడి చేయనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఐపీఎల్ వేలం ప్రక్రియలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మినహా మిగతా జట్లు పాత ఆటగాళ్లను తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదని స్పష్టమైంది. సీఎస్కే జట్టులో ఒకరిద్దరు మినహా అందరూ పాత ప్లేయర్లే ఉన్నారు. అయితే, తిరిగి సీఎస్కే జట్టులోకి రావడంపై అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'తనను సీఎస్కే జట్టులోకి తిరిగి తీసుకున్నందుకు ఆనందంగా ఉందని, అదే విధంగా వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వాన్ బ్రావోను కూడా తిరిగి పొందడం సంతోషంగా ఉందన్నాడు. నా తలనొప్పి చాంపియన్ తిరిగొచ్చాడు అంటూ రాసుకొచ్చాడు. వీరిద్దరితో పాటు దీపక్ చాహర్, రాబిన్ ఉతప్పలను వేలంలో దక్కించుకున్న చెన్నై జట్టు.. సురేశ్ రైనాను మాత్రం కొనుగోలు చేయలేదు.

Advertisement

Next Story

Most Viewed