జగన్‌ని టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదు: బీఆర్ఎస్‌పై YS vijayamma షాకింగ్ కామెంట్స్

by Satheesh |
జగన్‌ని టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదు: బీఆర్ఎస్‌పై YS vijayamma షాకింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీపై వైఎస్ విజయమ్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని పరిపాలిస్తానంటున్న కేసీఆర్.. ముందు తెలంగాణను ఉద్ధరించి ఉంటే బాగుండేదన్నారు. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావం చూపడం సంగతి తర్వాత అని.. ముందు తెలంగాణలోనే ఆ పార్టీ ఏమవుతుందో చూద్దామన్నారు. ఏపీలో జగన్‌ని టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ, బండి సంజయ్ వంటి వారు పాదయాత్రలు చేశారని.. వారికి పర్మిషన్ ఇచ్చి షర్మిలకు ఎందుకు నిరాకరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. షర్మిలను సొంతంగా తన ప్రయత్నం చేస్తోందని.. ఆమె వెనుక ఎలాంటి శక్తులు లేవన్నారు.

Next Story

Most Viewed