Gandhi Bhavan : గాంధీభవన్‌లో వైసీపీ ఎంపీ.. కొత్త పీసీసీ చీఫ్‌‌కు సన్మానం

by Ramesh N |
Gandhi Bhavan : గాంధీభవన్‌లో వైసీపీ ఎంపీ.. కొత్త పీసీసీ చీఫ్‌‌కు సన్మానం
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో వైసీపీ రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రత్యక్షమయ్యారు. ఇవాళ గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉత్తర తెలంగాణ జిల్లాల వారీగా పార్టీ సమీక్ష సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆర్.కృష్ణయ్య అక్కడికి వచ్చారు. కొత్త పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఆయన సన్మానించారు.

అయితే బీసీ నేత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనందున బీసీ సంఘం తరఫున మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఆర్.కృష్ణయ్య సన్మానించినట్లు తెలుస్తున్నది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని, బీసీల కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed