- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఈ ప్రభుత్వానికి రైతులంటే ఎందుకంత చిన్నచూపు?.. బీఆర్ఎస్ పార్టీ భావోద్వేగ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ఎందుకంత చిన్నచూపు అని బీఆర్ఎస్ పార్టీ భావోద్వేగ ట్వీట్ చేసింది. అకాల వర్షాల వల్ల పలు చోట్ల ధాన్యం తడిసి ముద్ద అవుతుందన్న దానిపై స్పందిస్తూ.. దీనికి సంబందించిన వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో మంగళవారం కురిసిన అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిన క్లిప్ లను చూపిస్తూ.. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి కన్నీరు మున్నీరు అవుతున్న రైతన్న అని పోస్ట్ చేసింది.
దీనిపై మొన్నటి దాకా నీళ్ళు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టి రైతన్న కంట కన్నీళ్లు పెట్టించిండ్రు అని, ఇప్పుడు పండిన ధాన్యాన్ని కొనకుండా అలసత్వం వహిస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసి రైతు కన్నీరు మున్నీరవుతున్నాడని అన్నారు. అంతేగాక రైతులంటే ఎందుకింత నిర్లక్ష్యం, చిన్నచూపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? అని ప్రశ్నిస్తూనే.. రైతు బాధలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెబుదాం! అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
మొన్నటి దాకా నీళ్ళు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టి రైతన్న కంట కన్నీళ్లు పెట్టించిండ్రు..
— BRS Party (@BRSparty) May 8, 2024
ఇప్పుడు పండిన ధాన్యాన్ని కొనకుండా అలసత్వం వహిస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసి.. కన్నీరు మున్నీరవుతున్న రైతన్న
రైతులంటే ఎందుకింత నిర్లక్ష్యం, చిన్నచూపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి?… pic.twitter.com/sKqwZvqCxr