- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆర్ఎస్ఎస్ చెప్పింది బీజేపీ చేస్తుంది: గురుదీప్ సప్పల్
దిశ; తెలంగాణ బ్యూరో: కేంద్రంలో కాంగ్రెస్ పవర్ లోకి రాగానే 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీడబ్ల్యూసీ మెంబరు గురుదీప్ సప్పల్ పేర్కొన్నారు. పదేళ్లలో బీజేపీ ఉద్యోగాలను నింపలేదని, వాటన్నింటినీ కాంగ్రెస్ భర్తీ చేస్తుందన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ..దేశ వ్యాప్తంగా నిరుద్యోగులంతా కాంగ్రెస్ కు అండగా ఉండాలన్నారు. బీజేపీ కి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్ తన శ్వేత పత్రంలో రాజ్యాంగం హిందు వ్యతిరేకంగా ఉందని, మార్పు చేయాలని రాసుకున్నట్లు గుర్తు చేశారు. రాజ్యాంగంలో అందరూ సమానం అని ఉన్నదని, రాజ్యాంగంలో అందరికీ ఓటు హక్కు ,రిజర్వేషన్లు ఉన్నాయని, ఇవి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని వివరించారు.
ఆర్ఎస్ఎస్ ఎజెండానే బీజేపీ అమలు చేస్తుందన్నారు. ఇక దేశ రక్షణ వ్యవస్థలో కీ రోల్ పోషించే ఆర్మీని కూడా కేంద్రం నిర్వీర్యం చేసిందన్నారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు పెంచాలంటే కులాల లెక్కలు తప్పకుండా అవసరమని, కుల గణన చేయకపోతే ఓబీసీ రిజర్వేషన్లు పెంచే అవకాశం లేదన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మోడీ దీన్ని అమలు చేయలేదన్నారు. తెలంగాణ ప్రజలకు ఆలోచించి ఓటేయాలని కోరారు. రాష్ట్రంలో నుంచి 14 ఎంపీ సీట్లను ఇవ్వాలని, దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ సుజాత పాల్ తదితరులు పాల్గొన్నారు.